Saturday, April 27, 2024

ఇండియా కూటమిలో అప్పుడే బీటలు

తప్పక చదవండి
  • బీజేపీ శక్తివందన్‌ వర్క్‌షాపులో కిషన్‌ రెడ్డి

హైదరాబాద్‌ : విపక్షాలు పెట్టుకున్న ఇండియా కూటమి అప్పుడే విచ్ఛిన్నం అవుతోందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నాడు శక్తి వందన్‌ వర్క్‌ షాప్‌ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, మహిళా రుణాలు, ముద్రా యోజన లోన్లపై అవగాహన కల్పించారు. ఒక్కో జిల్లా నుంచి 15మంది ప్రతినిధులను బీజేపీ నాయకత్వం నియమించింది. ఈ కార్యక్రమానికి కిషన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని.. ఆ కుంభకోణాల వల్లే అధికారానికి దూరం అయిందని విమర్శించారు. కాంగ్రెస్‌ అవినీతిపై విసిగి పోయిన ప్రజలు బీజేపీకి పట్టం కట్టారని తెలిపారు. సమర్థవంతంగా కరోనాను మోదీ ఆధ్వర్యంలో ఎదుర్కొన్నామని చెప్పారు. స్వయంగా ప్రధాని వచ్చి వ్యాక్సిన్‌ తయారు చేసే కంపెనీలను సందర్శించి వారికి ధైర్యం ఇచ్చారన్నారు. మోదీని విమర్శించే ధైర్యం విపక్షాలకు లేదన్నారు. ఏదో ఓ రకంగా మోదీపై కొన్ని పార్టీల్లోని నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఎలాంటి అవినీతి లేకుండా మోదీ పాలన సాగిస్తున్నారని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలలో కనీసం రోడ్లు కూడా ఉండేవి కావని.. ఇప్పుడు పెద్ద ఎత్తున జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు