Saturday, May 18, 2024

అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్

తప్పక చదవండి
  • ఆరు గ్యారెంటీల అమలు ఖాయం
  • కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర

స్టేషన్ ఘన్పూర్ : స్టేషన్ ఘన్పూర్ మండల పరిధిలోని గ్రామాoలొ రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర గ్రామ ప్రజలుమాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు ఇప్పటివరకు ఏమి పట్టించుకోలేదని, మాకు సరైన రోడ్డు సౌకర్యం లేదని ఇండ్లు కట్టేయలేదని, విద్యార్థులకు సరైన పాఠశాల కూడా లేదని ప్రభుత్వా దావకన కూడా లేదు, డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించాలని, రాఘవపూర్ ప్రధాన రహదారి ప్రక్కన సర్వీస్ రోడ్డును ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. 392 సర్వేలో ఆనాడు కాంగ్రెస్ హయాంలో కేటాయించిన ఇండ్ల స్థలాలను మళ్లీ అక్కడ నివసిస్తున్న ప్రజలకే కేటాయించాలని కోరారు. ఆనాడు కాంగ్రెస్ సమయంలో కట్టించిన ఇందిరమ్మ ఇండ్ల లోని ఉన్నాము కేసిఆర్ ఒక్క ఇల్లు కూడా కట్టియలేదు అని తెలియజేయడం జరిగినది. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిరా మాట్లాడుతూ. ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసింది కానీ నేటి కేసీఆర్ ప్రభుత్వం 9 సంవత్సరాలు గడిచిన ఒక రైతులుకు పూర్తిగా రుణమాఫీ చేసిన దాఖలు లేవు కొత్తగా రుణాలు ఇచ్చిన సందర్భం లేదు. ఆనాడు రైతులకు సబ్సిడీ కింద ఎరువులు వ్యవసాయ పనిముట్లు డ్రిప్ పైపులు అందించిన ఘనత కాంగ్రెస్ పార్టీగా దక్కుతుంది. కావున కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని పిలుపునివ్వడం జరిగింది
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, మహిళా నాయకురాలు, యువజన నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు