అమరావతి : రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గుహనాథన్ నరేందర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో సోమవారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్.. ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం తర్వాత గవర్నర్, ప్రధాన న్యాయమూర్తి.. జస్టిస్ నరేందర్కు అభినందనలు తెలిపారు. హైకోర్టుకు చెందిన పలువురు న్యామూర్తులు పాల్గొన్నారు.