Wednesday, May 15, 2024

బీఆర్ఎస్ లో చేరిన ఎర్ర శేఖర్

తప్పక చదవండి

హైదరాబాద్ : మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఒక్కొక్కరుగా సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో బలమైన నేతగా ఉన్న ఎర్ర శేఖర్.. కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ఎర్ర శేఖర్ బీఆర్ఎస్ లో చేరారు. గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్. ఎర్ర శేఖర్ చేరికతో పాలమూరులో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని ఎర్ర శేఖర్ ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్ తో తనకు గొప్ప అనుబంధం ఉందని ఎర్రశేఖర్ తెలిపారు. గతంలో మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉన్న కేసీఆర్ తో కలిసి పనిచేసిన విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల ఆర్థిక స్థితిగతులను పెంచేలా ఆత్మగౌరవంతో బతికేలా అనేక కార్యక్రమాలను కేసీఆర్ గారు చేపట్టారని ఈ సందర్భంగా ఎర్ర శేఖర్ అన్నారు. బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యంగా ముదిరాజులను ఆర్థికంగా స్థితి మంతులను చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలను భవిష్యత్తులో ముందుకు తీసుకుపోయేందుకు కేసిఆర్ గారి నాయకత్వంలో నడిచేందుకు ఈరోజు పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో ఒకప్పుడు దయనీయంగా ఉన్న ముదిరాజుల జీవితాలు ఈరోజు ప్రభుత్వం చేపట్టిన చేపల పంపిణీ, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల వలన గుణాత్మక మార్పు వచ్చిందని, మత్స్య సంపద విపరీతంగా పెరిగిందని ఎర్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంతో పాటు బీసీల కోసం చేపట్టిన అనేక అద్భుతమైన కార్యక్రమాలు పట్ల కెసిఆర్ కి ధన్యవాదాలు తెలిపిన ఎర్రశేఖర్, కెసిఆర్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో పనిచేస్తానని తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు