జల్పల్లి : రాచకొండ కమిసనరేట్ మహేశ్వరం డివిజన్ బాలాపూర్ పోలీసుస్టేషన్ పరిధి శివాజీ చౌక్లో గంజాయి విక్రయిస్తున్నట్లు ఎల్.బి నగర్ జోన్ ఎస్ఓటి పోలీసులకు పక్క సమాచారం రావడంతో బాలాపూర్ పోలీసుల సహాయంతో దాడి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లూరిసీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం పోలవరం గ్రామానికి చెందిన కురుసం లక్ష్మయ్య కుమారుడు కురుసం రాజేష్ దొర అలియాస్ రాజు (23) ను అరెస్టు చేశారు. అతని నుంచి 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని బాలాపూర్ ఠాణా ఇన్స్స్పెక్టర్ బి. వెంకటరెడ్డి అప్పగించారు. బాలాపూర్ పోలీసులు నిందితుడిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.