- భారీగా తరలి వచ్చిన పట్టణ ప్రజలు
హైదరాబాద్ : పీర్జాదిగూడ చెరువు కట్ట మైసమ్మ తల్లి దేవాలయం దసరా ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీగా ఉత్సవాలు జరిగాయి. పీర్జాదిగూడ చెరువు కట్ట (మినీ ట్యాంక్ బండ్) కట్ట మైసమ్మ గుడి వద్ద మొట్టమొదటి సారి దసరా ఉత్సవ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు అలువాల దేవేందర్ గౌడ్ అధ్యక్షతన దసరా ఉత్సవాలు జరిగినవి. ఈ సందర్భంగా రావణ దహన జమ్మి పూజ, తదితర కార్యక్రమాలు అతిథుల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు.