హైదరాబాద్ : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని తెలుగు తల్లి విగ్రహం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు ఎంతో గొప్పవన్నారు. ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని చెప్పారు. మహిళల అభివృద్ధే నిజమైన అభివృద్ధి అన్న అంబేద్కర్ మాటలను గుర్తు చేశారు.