హైదరాబాద్ : వేములవాడ టెంపుల్కు హెచ్ఎండీఏ నుంచి రావాల్సిన రూ.20 కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని హెచ్ఎండీఏ అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. అలాగే వేములవాడ లో బ్రిడ్జి నిర్మానానికి 30 కోట్ల నిధులు మంజూరు చేయాలని సీఎస్ను సీఎం ఆదేశించారు. వేములవాడ చెరువు సుందరీకరణకు ప్రత్యేక నిధులు ఇస్తామని హామీనిచ్చారు. త్వరలో మరో సమావేశం నిర్వహిస్తామన్న ఆయన తెలిపారు. కాగా, వేములవాడ టెంపుల్ డెవలప్ మెంట్ అథారిటీతో డా.బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సంబంధిత అధికారులు హాజరయ్యారు.