- విశాఖలో పర్యటించిన సీఎం జగన్
- ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం
- త్వరలోనే విశాఖ వస్తానన్న సీఎం
డిసెంబర్ నాటికి విశాఖకు రాబోతున్నట్లు తెలిపారు.. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని.. ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని తెలిపారు. విశాఖలో సీఎం జగన్ ఇవాళ ఐటీ హిల్స్ దగ్గర ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. డిసెంబర్ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానని.. డిసెంబర్ నుంచి తాను కూడా విశాఖలోనే ఉంటానని తెలిపారు సీఎం జగన్. నగరంలోని రుషికొండలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడ ఉద్యోగులతో కొద్దిసేపు ముచ్చటించారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభమవుతుందని.. డిసెంబర్లోపు విశాఖకు మారతానని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్, బెంగళూరు మాదిరిగా విశాఖలో కూడా మరిన్ని అవకాశాలు ఉంటాయన్నారు. వైజాగ్ ఎడ్యుకేషనల్ హబ్గా మారిందని.. ప్రతీ ఏడాది 15వేల మంది ఇంజనీర్లు తయారవుతున్నారన్నారు. ఏపీలోనే విశాఖ అతి పెద్ద నగరమని.. అంతర్జాతీయ విమానాశ్రయం, విస్తారమైన తీర ఈ ప్రాంతానికి సొంతం అన్నారు. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ సంస్థలు వస్తున్నాయని.. ఒక్క ఫోన్ కాల్తో ఎలాంటి సదుపాయాలు కావాలన్నా కంపెనీలకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. తాను కూడా త్వరలోనే విశాఖకు షిఫ్ట్ అవుతున్నానని స్పష్టం చేశారు. పరిపాలన విభాగం అంతా విశాఖకు మారుతుందని.. ఇక్కడి నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. డిసెంబర్లోపు విశాఖకు మారతానని.. విశాఖ నుంచే పాలన కొనసాగిస్తామన్నారు. విశాఖ నగరానికి మంచి భవిష్యత్ ఉందని.. కలల నగరంగా అభివృద్ధి చెందబోతోందన్నారు. ఇన్ఫోసిస్ రాకతో విశాఖ మరింత వేగంగా వృద్ధి చెందుతుందని.. వారికి (ఇన్ఫోసిస్) అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. ఏపీలో హైబ్రీడ్ వర్కింగ్ మోడల్లో వెయ్యిమందికి ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపింది ఇన్ఫోసిస్.. ఏపీలో ఐటీ నిపుణులకు కొదవలేదన్నారు ఆ సంస్థ ప్రతినిధులు.