Sunday, May 19, 2024

4వ వార్డులో ఇంటింటికి బొట్టు కార్యక్రమం

తప్పక చదవండి
  • పాల్గొన్న శాలిని మహేందర్ రెడ్డి, చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి, కౌన్సిలర్ తుడుం గణేష్

మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటీ 4వ వార్డులో నిర్వహించిన గడప గడపకు బొట్టు కార్యక్రమంలో భాగంగా కౌన్సిలర్ తుడుం గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమం లో చామకూర శాలిని మహేందర్ రెడ్డి, చైర్ పర్సన్ మర్రి దీపిక నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ తుడుము గణేష్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రంలో ఎక్కడ తిరిగిన ప్రజలను నుంచి మంచి స్పందన వస్తుందని కౌన్సిలర్ తుడుం గణేష్ తెలిపారు. నవంబర్ 30న జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపుకు కృషి చేస్తూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలన్నారు. మేడ్చల్ నుండి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో గెలుపబోతున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిందంటే సీఎం కేసీఆర్ పుణ్యమేనన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే చేయని అభివృద్ధి మంత్రి మల్లారెడ్డి చేశారన్నారు. కనుక మేడ్చల్ నుండి మరోసారి మల్లారెడ్డిని గెలిపించుకోవాల్సిన భాద్యత మనందరిపై ఉందన్నారు. తెలంగాణ కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం, మేడ్చల్ నుండి మరోసారి ఎమ్మెల్యేగా మల్లారెడ్డిలు కాబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో శాలి మహేందర్ రెడ్డి మరి దీపిక నరసింహారెడ్డి. టౌన్ ప్రెసిడెంట్ శేఖర్ గౌడ్, కోఆప్షన్ నెంబర్ గీత మధుకర్, మహిళలు, యువకులు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు