- నామినేషన్ పత్రాలు సమర్పించిన ఆయన సతీమణి కవిత..
హైదరాబాద్ : పటాన్ చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నీలం మధు ముదిరాజ్ తన తొలి నామినేషన్ వేశారు. నీలం మధు తరఫున ఆయన సతీమణి నీలం కవిత ముదిరాజ్ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకున్న నీలం మధు ముదిరాజ్ రుద్రారం గణేష్ గడ్డలోని సిద్ధి గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ముహూర్తం ప్రకారం మంగళవారం మంచి రోజు కావడంతో ఆలయ ప్రాంగణంలోనే నామినేషన్ పత్రాలపై సంతకం చేసి తన సతీమణి నీలం కవిత ముదిరాజ్ ద్వారా నామినేషన్ దాఖలు చేయించారు.