- మండల అధ్యక్షుడు దయానంద్ యాదవ్
మేడ్చల్ : ఈ నెల 30వ తేది సోమవారం ఉదయం మేడ్చల్ మండల బూత్ కమిటీల సమావేశం నిర్వహించడం జరుగుతుందని మేడ్చల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ తెలిపారు. ఈ సందర్బంగా దయానంద్ యాదవ్ మాట్లాడుతూ మేడ్చల్ మండలం కండ్లకోయాలోని నిమ్మల గార్డెన్ లో నిర్వహించే మేడ్చల్ మండల బూత్ కమిటీల సమావేశానికి కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పాల్గొంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇటివల ఎర్పాటు చేసిన బూత్ కమిటీలతో పాటు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, పార్టీ ప్రజాప్రతినిధులు, అభిమానులు, ఉద్యమ కారులు తరలి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నానని తెలిపారు.