Thursday, May 16, 2024

ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి

తప్పక చదవండి

మహబూబ్ నగర్ : అభివృద్ధే తమ పార్టీ ఎజెండా అని బీజేపీ మహబూబ్ నగర్ అభ్యర్థి మిథున్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా అయన మాట్లాడుతూ.. పాలమూరు ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా 20 ఏళ్లుగా నిస్వార్ధంగా పాలమూరు ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి నాయకత్వంలో పెరిగిన వాడిని.. ఒక మచ్చలేని నాయకుడి పెంపకంలో పెరిగి పాలమూరు యువత ఆశయాలు సాధించుకునేందుకు నరేంద్ర మోడీ పంపిన ప్రతినిధిగా మీ ముందుకు వచ్చాను.. మీరు ఆశీర్వదించి పాలమూరు అభివృద్ధికి అవకాశం కల్పించాలని కోరుతున్నాను. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే, పాలమూరులో ఎమ్మెల్యే ట్యాక్స్ ఉండదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో నిర్మించిన అప్పనపల్లి బ్రిడ్జిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఫోటోలకు ఫోజులిచ్చి, తాము చేసినవని చెప్పుకుంటున్నారు. కరోనా సమయంలో దేశమంతట కరోనా వ్యాక్సిన్ వేయించి మన వెన్నుదన్నుగా నిలిచిన ప్రధాని మోడీ అన్నారు. గ్రామ పంచాయతీలకు ప్రధాని నరేంద్ర మోడీ కేంద్రం నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పడకుల బాలరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి శ్రీనివాసరెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాండురంగారెడ్డి, అసెంబ్లీ ఇన్చార్జి అర్జిగట్ల అంజయ్య, వార్డు కౌన్సిలర్ రామాంజనేయులు, పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్, అరవింద్, శ్రీశైలం యాదవ్, ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి, రాజు గౌడ్, మహిళా మోర్చా జిల్లా నాయకురాలు యాదమ్మ, పద్మవేణి, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు