మఠంపల్లి : సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం మఠంపల్లి మండలంలోని నాగార్జున సిమెంట్ అనుబంధంగా ఉన్న బైసన్ ప్యానల్ గురించి గత పది రోజుల క్రితం ప్రచురించిన వార్తకు బైసన్ యాజమాన్యం స్పందించి బాధితులకు డబ్బులు ఇప్పించ డం జరిగింది. వాస్తవానికి ఈ డబ్బులు వ్యవహారం యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేక పోయినా బాధితులు బైసన్ యాజమాన్యం పెద్దలను సంప్రదించగా వారు కూడా మంచి మనసుతో స్పందించి అందులో పని చేసే కాంట్రాక్టర్ ని హెచ్చరించి మరొక సారి ఇటువంటి చర్యలకు పాల్పడితే మీ మీద సంస్థ తరుపున కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించి బాధితులకు డబ్బులు ఇప్పించడం జరిగింది. అదే విధంగా ఇలాంటి డబ్బు లావాదేవిల విషయం గురించి మీరు బయట చూసుకోండి. ఇంకో సారి సంస్థని తప్పుగా చూపిస్తే సహించేది లేదని అందులో పని చేసే కాంట్రాక్టర్కి డబ్బులు ఇచ్చి మోసపోయిన బాధితులకు హెచ్చరించడం జరిగింది. ఈ సందర్భంగా డబ్బులు తిరిగి ఇప్పించడం పట్ల బాధితులు బైసన్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.