Saturday, May 4, 2024

ఎన్నికల వేళ… అందరినీ కాక పట్టాల్సిందే..?

తప్పక చదవండి
  • గొర్ల కాపరి ముచ్చటించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌ : ఎన్నికల సమయంలో పోటీ చేసే అభ్యర్థులను ఎవరినీ వదలిపెట్టరు. ఓట్లను అభ్యర్థించేందుకు నానా తంటాలు పడుతుంటారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్‌ నియోజకవర్గంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మామడ మండల వాస్తవాపూర్‌లో ప్రచారానికి వెళ్తుండగా మార్గమధ్యలో గొర్ల మందతో వెళ్తున్న గొర్ల కాపరి మంత్రికి కనిపించారు. వెంటనే కాన్వాయ్‌ని ఆపి గొర్ల కాపరి మహేష్‌తో ముచ్చటించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? గొల్ల, కురుమలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకం ద్వారా గొర్లు తీసుకున్నావా? అని మహేష్‌ ను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ వచ్చినంకా అన్ని కులాల వారికి మంచి లాభం జరుగుతుంది. ఎన్నో కుటుంబాలు గొర్రెలను నమ్ముకుని బతుకుతున్నాయి. మాలాంటోళ్లకు సీఎం కేసీఆర్‌ సబ్సిడీపై గొర్రెలను పంపిణీ చేస్తూ ఆదుకుంటున్నారు. నాకు కూడా గొర్రెలు వచ్చాయి. తాతముత్తాతల కాలం నుంచే మా కుటుంబం గొర్రెలను మేపుతూ బతుకుతుంది. మాకు మంచి చేస్తున్న కేసీఆర్‌సార్‌కే అండగా ఉంటామని మహేష్‌ సమాధానం ఇచ్చారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు