హైదరాబాద్ : ఆర్మీ జవాన్ గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు . ఈ సంఘటన బుధవారం లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ సెంటర్లో చోటు చేసుకుంది. పంజాబ్కు చెందిన రాజిందర్ ఈరోజు తెల్లవారుజామున తన వద్ద ఉన్న తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. జవాన్ ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.