Monday, April 29, 2024

కేసీఆర్ ను కలిసి పరామర్శించిన ఏపీ సీఎం జగన్…

తప్పక చదవండి

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి బయల్దేరి బేగంపేట చేరుకున్న జగన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. అనంతరం నంది నగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన జగన్.. ఆయన్ను పరామర్శించారు. కేసీఆర్, జగన్ మధ్య మంచి రాజకీయ సంబంధాలు ఉన్నాయి. ఉద్యమం సమయంలో జగన్ సమైక్యాంధ్రకు మద్దతుగా నిలిచిన సమయంలో రెండు పార్టీల మధ్య వివాదం ఏర్పడింది. జగన్ పరకాల పర్యటనకు వెళ్లిన సమయంలో రైల్వే స్టేషన్ లో టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఏపీలో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు.. తెలంగాణలోనూ ఆయన రాజకీయాలు చేస్తూండటంతో.. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లుగా కేసీఆర్, జగన్ రాజకీయ స్నేహితులు అయ్యారు. 2018 ముందస్తు ఎన్నికల సమయంలో వైసీపీకి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా సహకరించింది. డేటా చోరీ వంటి కేసులు పెట్టడంతో పాటు.. టీడీపీకి ఆర్థికపరమైన వనరులు తెలంగాణ నుంచి అందకుండా చేయడంలో కేసీఆర్ సర్కార్ కీలక పాతర్ పోషించిందని చెబుతారు. అదే సమయంలో వైసీపీకి ఆర్థిక సాయం కూడా అందించారని అంటారు.ఎన్నికల్లో గెలిచిన తర్వాత కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిశారు. ఆ తర్వాత కూడా భేటీలు జరిగాయి. కానీ గత రెండు, మూడేళ్లుగా నేరుగా సమావేశం కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య పలు సమస్యలు వచ్చినా నేరుగా జగన్ ఎప్పుడూ కల్పించుకోలేదు. రాజకీయ సంబంధాలు మాత్రం యధావిధిగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో వైసీపీకి చెందిన కీలక నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ తరపున కీలక పాత్ర పోషించారు.సర్వేలు, అభ్యర్థులు, అభ్యర్థులకు ఆర్థిక సాయం విషయంలో ఆయన కీలకంగా వ్యవహరించారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతూ ఉంటాయి. అయినా ఎన్నికల్లో వ్యతిరేక ఫలితం వచ్చింది. తాజా భేటీలో చెవిరెడ్డి కూడా పాల్గొన్నారు. కానీ కేసీఆర్, జగన్ ముఖాముఖి చర్చలు జరిపిన సమయంలో పక్కన చెవిరెడ్డి కూడా లేనట్లుగా తెలుస్తోంది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో ఏపీ అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల వ్యూహాలపై కేసీఆర్ చర్చించినట్లుగా చెబుతున్నారు.

సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా కేసీఆర్ ను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ కేటీఆర్, బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు