- జాబిల్లి నుంచి భూకక్ష్యలోకి ప్రొపల్షన్ మాడ్యూల్
- చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్
- ఆగస్టు 23న చంద్రయాన్-3 సేఫ్ ల్యాండింగ్
- ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి తీసుకొచ్చిన ఇస్రో
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) : భారతదేశానికే గర్వకారణంగా నిలిచింది చంద్రయాన్ 3. ప్రపంచ దేశాల్లో భారత్ సగర్వంగా ఉనికిని చాటుకునేలా.. తలెత్తుకుని నిలిచేలా చేసింది. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడిరచింది. చంద్రయాన్ త్రీ ప్రొపల్షన్ మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చారు. ఇది ప్రత్యేక ప్రయోగమని, తమ ప్రణాళికల్లో లేదని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. చంద్రుడి ఉపరితలం నుంచి నమూనాలను సేకరించే ప్రణాళికలు రూపొందిస్తున్న ఇస్రో.. తాజా ప్రయోగం ఆ మిషన్కు దోహదపడుతుందని తెలిపింది. జాబిల్లిపై నమూనాలను సేకరించి అక్కడ నుంచి తిరిగి వచ్చే మిషన్ కోసం ప్రణాళికలు రూపొందించేందుకు ప్రొపల్షన్ మాడ్యూల్లోని అదనపు సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొంది. చంద్రుడిపై విక్రమ్ హాప్ ప్రయోగాన్ని అనుసరించి ఇది మరో విజయాన్ని సూచిస్తుందని వెల్లడిరచింది. చంద్రునిపై ఇంజిన్లను ప్రేరేపించి, పరికరాలను నియంత్రించే సామర్థ్యాన్ని ప్రదర్శించిందని వివరించింది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలకు ఈ ఏడాది జులై 14న శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి చంద్రయాన్-3 మిషన్ను ఇస్రో ప్రయోగించింది. జాబిల్లి కక్ష్యలోకి చేరిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యుల్, ల్యాండిరగ్ మాడ్యుల్ వేరుపడ్డాయి. అనంతరం ఆగస్టు 23న జాబిల్లిపై ల్యాండర్ విజయవంతంగా దిగింది.
ల్యాండిరగ్ మాడ్యుల్లోని ‘విక్రమ్ ల్యాండర్’, ‘ప్రజ్ఞాన్ రోవర్’ అక్కడ రెండు వారాల పాటు పరిశోధనలు సాగించి, ప్రస్తుతం నిద్రాణ స్థితిలో ఉన్నాయి. వినూత్న మిషన్ వ్యూహాలను ఉపయోగించి, ప్రొపల్షన్ మాడ్యూల్ కార్యాచరణ జీవితకాలాన్ని పొడిగించాలని, భవిష్యత్తులో చంద్రుని మిషన్లకు అందులోని మిగిలిన ఇంధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో ప్లానింగ్తో చంద్రుడి కక్ష్య నుంచి భూమి కక్ష్యకు తీసుకొచ్చింది. చంద్రుడు లేదా భూమి జియో బెల్ట్తో ఢీకొట్టే సంభావ్యతను నివారిస్తుంది. ‘అక్టోబరు 2023లో ప్రారంభించిన మాడ్యూల్ వెనక్కి తీసుకొచే విన్యాసాల్లో అపోలూన్ ఎత్తును పెంచడం, ట్రాన్స్-ఎర్త్ ఇంజెక్షన్ నిర్వహించడం వంటివి ఉన్నాయి. చంద్రుని కక్ష్య నుంచి బయలుదేరే ముందు ప్రొపల్షన్ మాడ్యుల్ నవంబరు 10న నాలుగుసార్లు జాబిల్లి చుట్టూ తిరిగింది’ఇస్రో తెలిపింది. ప్రస్తుత కక్ష్య అంచనాల ఆధారంగా పనిచేసే ఉపగ్రహాలకు ఎటువంటి ముప్పు లేకుండా నవంబర్ 22న దాని మొదటి పెరిజీని దాటి ప్రస్తుతం భూమి చుట్టూ పరిభ్రమిస్తోంది. భూ పరిశీలన కోసం రూపొందించిన ప్రొపల్షన్ మాడ్యుల్పై షేప్ పేలోడ్ ప్రణాళికాబద్ధంగా పని చేస్తూనే ఉంది. ఇస్రో ఫ్లైట్ డైనమిక్స్ బృందం ఈ ఆపరేషన్ కోసం ఒక అధునాతన విశ్లేషణ సాధనాన్ని అభివృద్ధి చేసింది. ఇది అంతరిక్ష పరిశోధన సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో ఇస్రో నిబద్ధతను చెబుతుంది. ‘చంద్రుడి కక్ష్య నుంచి తీసుకొచ్చేందుకు చేపట్టిన విన్యాసాల్లో సాఫ్ట్వేర్ మాడ్యూల్ అభివృద్ధి, గురుత్వాకర్షణ-సహాయక ఫ్లైబైలను అమలు చేయడం, అదుపుతప్పి ఢీకొట్టే ప్రమాదాన్ని నివారించడం వంటివి ఉన్నాయి’ అని ఇస్రో తెలిపింది. తిరిగి భూకక్ష్యకు మాడ్యూల్ను తీసుకురావడం మిషన్ జీవితకాలాన్ని పొడిగించడమే కాకుండా భవిష్యత్తులో చంద్రుడి మిషన్ల కోసం విలువైన సమాచారం, సామర్థ్యాలను కూడా అందిస్తుంది.