Sunday, May 19, 2024

మేడ్చల్ మండలంలో బీఅర్ఎస్ పార్టీకి మరో షాక్…?

తప్పక చదవండి

మేడ్చల్ : మంత్రి మల్లారెడ్డికి సొంత పార్టీ నాయకులు షాక్ ఇవ్వనున్నారా అంటే అవును అనే మాటలు వినపడుతున్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాటలో మరి కొంతమంది మేడ్చల్ మండల నాయకులు ప్రజాప్రతినిధులు చేరనున్నారు. మేడ్చల్ మండలంలోని ఎంపీటీసీ కుమార్ యాదవ్. ఎల్లంపేట గ్రామ సర్పంచ్ వెన్నెల రామ కృష్ణుడు, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి బాటలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.. ఎన్నికల వేళ మేడ్చల్ అసెంబ్లీ సెగ్మెంట్లో రాజకీయాలు రసవతంగా మారాయి. ఇటీవల కాలంలో అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వలసలు పెరుగుతున్నాయి. మంత్రి మల్లారెడ్డి కి షాకుల మీద షాక్కులు తగులుతున్నాయి.. మంత్రి మల్లారెడ్డి పై ఉన్న అసంతృప్తితో పార్టీని హస్తం గూటికి చేరుతున్నారు.. ఇలా మేడ్చల్ మండలంలో అధికార పార్టీకి చెందిన బలమైన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని విడిపోతూ ఉండడంతో అధికార పార్టీలో ఆందోళన మొదలైంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు