- కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపు
- ముగిసిన టీటీడీ పాలకమండలి సమావేశం
- వార్షిక బడ్జెట్కు పాలకమండలి ఆమోదం
- మహిళా భక్తులకు మంగళసూత్రాలు..లక్ష్మీకాసులు
- నూతన పోస్టులు మంజూరు.. ఆదాయంపై అంచనాలు
తిరుమల : ఉద్యోగులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. పోటు విభాగంలోని 70 మంది ఉద్యోగులను స్కిల్డ్ లేబర్ గా గుర్తిస్తూ రూ.15 వేల జీతాలు పెంచుతున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేరకు 2024 – 25 ఏడాదికి సంబంధించి రూ.5,141 కోట్ల అంచనాతో రూపొందించిన వార్షిక బ్జడెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. పాలకమండలి నిర్ణయాలను ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడిరచారు. టీటీడీ ఆధ్వర్యంలోని 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ.35 వేల నుంచి రూ.54 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు. టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు, దేవస్థానం పరిధిలోకి తీసుకున్న 34 ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం ఉద్యోగుల నియామకం కోసం ప్రభుత్వ అనుమతికి విజ్ఞప్తి చేసింది. ధర్మ ప్రచారంలో భాగంగా బంగారు డాలర్ల తరహాలో మంగళ సూత్రాలను భక్తులకు అందుబాటులో తేవాలని నిర్ణయం. వీటిని శ్రీవారి పాదాల చెంత ఉంచి.. అనంతరం కొత్తగా పెళ్లైన జంటలకు అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. వాటర్ వర్క్స్ తో పాటు అన్న ప్రసాదం, టీటీడీ స్టోర్స్ లో పని చేస్తోన్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపునకు నిర్ణయించారు. రూ.30 కోట్ల వ్యయంతో గోగర్భం నుంచి ఆకాశగంగ వరకూ 4 వరుసల నిర్మాణం చేసేందుకు అనుమతి నారాయణవనంలో వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.6.9 కోట్ల కేటాయింపుతో పాటు స్విమ్స్ అభివృద్ధి పనుల కోసం రూ.149 కోట్ల కేటాయింపు చేపట్టారు. సప్తగిరి అతిథి గృహాల అభివృద్ధి పనులకు రూ.2.5 కోట్ల కేటాయింపు చేశారు. ఎస్ఎంసీ, ఎస్ఎస్సీ కాటేజీల అభివృద్ధి పనుల కోసం రూ.10 కోట్ల కేటాయింపు జరిగింది. వేద పండితుల పెన్షన్ రూ.10 వేల నుంచి రూ.12 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తోన్న అర్చకుల జీతాల పెంపుతో పాటు 56 వేదపారాయణ దారుల పోస్టుల నియామకానికి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల కేటాయింపునకు సహకరించిన సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతూ టీటీడీ తీర్మానం చేసింది. ఇక, ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకూ ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ 57 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హాజరవుతారని.. ధార్మిక ప్రచారంలో భాగంగా వారి సూచనలను తప్పక పాటిస్తామని చెప్పారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.1611 కోట్లుగా టీటీడీ అంచనా వేసింది. వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ల ద్వారా రూ.1167 కోట్ల రాబడి, ఇతర పెట్టుబడుల ద్వారా రూ.129 కోట్ల ఆదాయం, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవ టికెట్ల ద్వారా రూ.448 కోట్లు, ప్రసాదం విక్రయాల ద్వారా రూ.600 కోట్లు, కల్యాణకట్టల రశీదుల ద్వారా రూ.151.50 కోట్లు, గదులు, కల్యాణమండపం బాడుగల ద్వారా రూ.147 కోట్లు ఆదాయం రానున్నట్లు అంచనా వేశారు. 2024 – 25 ఏడాదికి రూ.5141.75 కోట్లతో వార్షిక బ్జడెట్ రూపొందించగా.. ఉద్యోగుల జీతభత్యాలకు రూ.1733 కోట్లు, నిత్యవసరాల కొనుగోళ్లకు రూ.751 కోట్ల కార్పస్ ఫండ్, ఇతర పెట్టుబడులకు రూ.750 కోట్లు, ఇంజినీరింగ్ పనులకు రూ.350 కోట్లు, స్విమ్స్ ఆస్పత్రి అభివృద్ధి పనులకు రూ.60 కోట్లు, ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ పనులకు రూ.190 కోట్లు కేటాయించారు. అలాగే, వివిధ సంస్థలకు గ్రాంట్స్ రూపంలో రూ.113.50 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం రూపంలో రూ.50 కోట్లు, టీటీడీ విద్యాసంస్థలు, వివిధ వర్శిటీలకు గ్రాంట్స్ రూ.173.31 కోట్లు, పారిశుద్ధ్య విభాగానికి రూ.261.07 కోట్లు, నిఘా, భద్రతా విభాగానికి రూ.149.99 కోట్లు, వైద్య విభాగానికి రూ.241.07 కోట్లుగా కేటాయించారు. సాధారణంగా టీటీడీ వార్షిక బ్జడెట్ను ఫిబ్రవరి లేదా మార్చి నెలలో ఆమోదిస్తుంటారు. అయితే, త్వరలోనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రావొచ్చనే అంచనాల నేపథ్యంలో ఈసారి జనవరిలోనే వార్షిక బడ్జెట్ కు టీటీడీ పాలకమండలి ఆమోదించింది. టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 2024-25 సంవత్సర బడ్జెట్కు పాలకమండలి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.5141.74 కోట్లతో టీటీడీ వార్షికబడ్జెట్కు ఆమోద ముద్ర పడిరది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా బంగారు మంగళ సూత్రాలు, లక్ష్మీ కాసులు భక్తులకు విక్రయించాలని టీటీడీ నిర్ణయించింది. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించింది. 3, 4, 5వ తేదీల్లో ధార్మిక సదస్సును నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ తెలిపారు. 57 మంది మఠ, పీఠాధిపతులు హాజరువుతున్నారన్నారు. వారి సలహాలు, సూచనలను స్వీకరించి అమలు చేస్తామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.