- రుణం చెల్లింపు కోసం ఫైనాన్స్ కార్పోరేషన్ నోటీసులు
- అసలు రూ. 20 కోట్లు, వడ్డీ రూ. 25కోట్లు చెల్లించాలని నోటీసులు
- ఇప్పటికే ఆర్టీసి, విద్యుత్ సంస్థల తాఖీదులు
నిజామాబాద్ : ఆర్మూర్ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇంతకాలం అధికార పార్టీలో ఉండి చేసిన అక్రమాలకు సమాధానం చెప్పుకోలేక పోతున్నారు. ఆర్టీసీ, ట్రాన్స్ కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమమో తాజాగా మరో షాక్ తగిలింది. ఇందులో భాగంగా తమ వద్ద తీసుకున్న రూ.20 కోట్ల రుణం వడ్డీతోకలిపి మొత్తం కలిపి రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఆయన తనపై కాల్పులు జరిగాయంటూ నానా హంగామా చేశారు. మొత్తంగా ఇప్పుడు ఆర్మూర్ బీఆరెస్స్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి అధికారులు గ్యాప్ ఇవ్వడలేదు! ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు నోటీసులు అంటించారు. అసలు రూ. 20 కోట్లు, వడ్డీ రూ. 25కోట్లు చెల్లించాలని ఆ నోటీసుల్లో కోరారు. దీంతో ఏమిటి లోన్, ఎవరి పేరున తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, ఇంతకాలం ఎందుకు చెల్లించకున్నారు.. మొదలైన ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కార్పొరేషన్ నుంచి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రూ.20కోట్లు రుణం తీసుకున్నారు. 2017లో ఆయన సతీమణి రజిత రెడ్డి పేరున జీవన్ రెడ్డి ఈలోన్ తీసుకున్నారని తెలుస్తుంది. అయితే నాటి నుంచి నేటి వరకు వడ్డీలు డబ్బు కూడా చెల్లించలేదని అంటున్నారు. ఫలితంగా అసలు ప్లస్ వడ్డీ కలిసి రూ.45 కోట్ల బకాయి ఉందని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు అంటించారు. దీంతో ఇంటికి నోటీసులు అంటించిన అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే జీవన్ రెడ్డి మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు! జీవన్ రెడ్డికి ఆర్టీసీ, ట్రాన్స్ కో అధికారులు ఏకకాలంలో బకాయిల వసూలుకు చర్యలు ప్రారంభిస్తూ ఇప్పటికే నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… ఆర్మూర్ పట్టణంలోని జీవన్ రెడ్డి సతీమణి రజితరెడ్డి తాను మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న విష్ణుజిత్ ఇన్ ప్టా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట టీఎస్ ఆర్టీసీ స్థలాన్ని లీజ్ కు తీసుకుని మాల్ అండ్ మల్టిప్లెక్స్ పేరిట ఐదు అంతస్తుల భారీ షాపింగ్ మాల్ నిర్మించారు.