Sunday, May 19, 2024

మంత్రి గంగుల కమలాకర్‌కు భారీ ఊరట

తప్పక చదవండి

హైదరాబాద్‌ : మంత్రి గంగుల కమలాకర్‌కు భారీ ఊరట లభించింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. ఈసీ నిర్ధారించిన వ్యయానికి మించి గంగుల ఖర్చు చేశారని కాంగ్రెస్‌ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కోర్టు తాజాగా విచారణ జరిపింది. విచారణ సందర్భంగా ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. 2018 ఎన్నికల్లో గంగుల పరిమితికి మించి ఎన్నికల ఖర్చు చేశారని పొన్నం ప్రభాకర్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో పిరమితికి మించి ఖర్చు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు