Tuesday, May 21, 2024

బాలుడి ప్రాణాలు దారుణంగా తీసిన కోతుల గుంపు

తప్పక చదవండి

అహ్మదాబాద్‌ : కోతుల గుంపు ఒక బాలుడిపై దాడి చేశాయి. అతడి కడుపు చీల్చి, పేగులు బయటకు లాగి దారుణంగా చంపాయి. ఆ బాలుడ్ని రక్షించేందుకు స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గుజరాత్‌లోని గాంధీనగర్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం సాల్కి గ్రామంలోని గుడి సమీపంలో పదేళ్ల దీపక్ ఠాకూర్‌ తన స్నేహితులతో కలిసి ఆడుతున్నాడు. ఇంతలో ఒక కోతుల గుంపు అతడిపై దాడి చేసింది. ఆ బాలుడి మీదకు దూకిన కోతులు గోళ్లతో ఆ చిన్నారి కడుపు చీల్చి పేగులను బయటకు తీశాయి.
స్పందించిన స్థానికులు కోతుల దాడి నుంచి ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. అతడ్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ బాలుడు అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు ఆ గ్రామంలో జనంపై కోతులు దాడి చేయడం ఇది మూడో సంఘటన. ఈ నేపథ్యంలో గ్రామస్తుల ఆగ్రహంతో అటవీ శాఖ అధికారులు స్పందించారు. కోతులను పట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు