- జింఖానా మైదానంలో నిర్వహించిన టీఎన్జీవో హైదరాబాద్
హైదరాబాద్ : టీఎన్జీయూస్ యూనియన్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డా.యస్.ఏం.హుస్సేని (ముజీబ్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తొమ్మిదవ ఎట్టం సదా నంద్ క్రికెట్ టోర్నమెంట్ మొదటి క్వార్టర్ ఫైనల్స్ ఆట పోటీలు జింఖానా మైదానంలో జరిగాయి. గాంధీ ఆసుపత్రి పై జిల్లా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ పై హైదరాబాద్ యూత్ ఫోర్స్, క్లాస్ ఫోర్ట్ పై వక్ఫ్బోర్డు, ఉస్మానియా కళాశాలపై ఆ.ర్టి.ఏ మరియు డీ.ఈ.ఓ. పై సి.ఆర్.ఓ జట్లు విజయం సాధించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్.విక్రమ్ కుమార్, సభ్యు లు వైదికశాస్త్ర, శ్రీధర్నాయుడు, ముఖిం ఖురేషి, మొహమ్మద్ వహీద్ ఆట పోటీలు నిర్వహించారు.