- మహేశ్వరం నుండి కొత్త మనోహర్ రెడ్డికి అవకాశం
- ఇప్పటి వరకు 87 మంది అభ్యర్థులను ప్రకటించిన బీఎస్పీ
- 32 మంది ఎస్సీలకు, 33 మంది బీసీలకు, 13 మంది ఎస్టీలకు టిక్కెట్ కేటాయింపు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీ). శనివారం హైదరాబాద్ లక్డికపూల్ లోని బీఎస్పీ కార్యాలయంలో బీఎస్పీ అధినేత్రి కుమారి మాయావతి అనుమతితో బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ 2023 అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 25 మందితో కూడిన మూడో జాబితాను ప్రకటించారు. కాగా ఇదివరకు జాబితాలో ప్రకటించిన రాజేంద్రనగర్ నియోజకవర్గ అభ్యర్థిని మూడో జాబితాలో మార్చారు. ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించింది. రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్ట్రించింది. ఇక నేటి రెండో జాబితాతో కలిపి మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించారు. మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.
మహేశ్వరం-కొత్త మనోహర్ రెడ్డి, చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్, అదిలాబాద్-ఉయక ఇందిర, ఆర్మూర్-గండికోట రాజన్న, నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్, బాల్కొండ-పల్లికొండ నర్సయ్య, కరీంనగర్-నల్లాల శ్రీనివాస్, హుస్నాబాద్-పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్, నర్సాపూర్-కుతాడి నర్సింహులు, సంగారెడ్డి-పల్పనూరి శేఖర, మేడ్చల్-మల్లేపోగు విజయరాజు, కుత్బుల్లాపూర్-మహ్మద్ లమ్రా అహ్మద్, ఎల్బీ నగర్-గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్, రాజేంద్రనగర్-రాచమల్లు జయసింహ (రివైజ్డ్), అంబర్ పేట్-ప్రో. అన్వర్ ఖాన్ (రివైజ్డ్), కార్వాన్-ఆలేపు అంజయ్య, గోషా మహల్-మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్, నారాయణ్ పేట్-బొడిగెల శ్రీనివాస్, జడ్చర్ల-శివ వుల్కుందఖర్, అలంపూర్ (ఎస్సీ)-మాకుల చెన్న కేశవరావు, పరకాల-అముధాలపల్లి నరేష్ గౌడ్, భూపాలపల్లి-గజ్జి జితేందర్ యాదవ్, ఖమ్మం-అయితగాని శ్రీనివాస్ గౌడ్, సత్తుపల్లి (ఎస్సీ)-సీలం వెంకటేశ్వర రావు, నారాయణ్ ఖేడ్-మహ్మద్ అలాఉద్దీన్ పటేల్ లకు చోటు దక్కింది.