ఎల్బీ నగర్ సాగర్ రింగ్రింగ్ రోడ్డు ఫ్లై ఓవర్ కూలీ పదిమందికి గాయాలు.. నలుగురి పరిస్థితి విషమం
ఫ్లై ఓవర్ నిర్మాణంలో అపశృతి చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బైరామల్గూడ ఫ్లై ఓవర్ ర్యాంహైదరాబాద్లోని ఎల్బీ నగర్ సాగర్ రింగ్రోడ్డులో చేపట్టినపు కుప్పకూలింది. దీంతో పది మంది కార్మికులు గాయపడ్డారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. వారంతా బీహార్, ఉత్తరప్రదేశ్కు చెందిన వారని వెల్లడిరచారు. పిల్లర్లపై భారీ ఇనుప వంతెనను సెట్ చేస్తుండగా జారిపడిరదని చెప్పారు. ఈ దుర్ఘటన అర్ధరాత్రి జరగడంతో పెను ప్రమాదం తప్పింది అనుకోవాలి. చాలా మంది ఈ ప్లైఓవర్ కింద నుంచి వాహనాదారులు వెళ్తూ ఉంటారు. జనాలు తిరిగే టైంలో జరిగి ఉంటే ప్రమాద స్థాయి మరింత ఎక్కువగా ఉండేదని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్పాట్ను సందర్శించారు. అక్కడి వారితో మాట్లాడారు. అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించారు. ధైర్యం చెప్పారు. వైద్యులతో మాట్లాడారు. వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.