Thursday, March 28, 2024

కామన్ విద్యా విధానంను అమలు చేయాలి

తప్పక చదవండి

మన దేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని విద్యా విధానంలో వివిధ మేనేజ్మెంట్లు ఉండడం వల్ల విద్యా విధానం గందరగోళంగా మారుతుంది.దేశవ్యాప్తంగా కామన్ విద్యా విధానంను ప్రవేశ పెట్టడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.దేశ వ్యాప్తంగా ఒకేసారి పరీక్షలు నిర్వహించడం ఒకేసారి ఫలితాలు ప్రకటించడం ఒకేసారి ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది.ప్రస్తుత విద్యా విధానంలో ప్రభుత్వ, పంచాయతీ రాజ్, మున్సిపల్, ఎయిడెడ్, కార్పోరేట్, మైనారిటీస్,మాడల్ స్కూల్, పబ్లిక్ స్కూల్ లు,నవోదయ స్కూల్ లు,కేంద్రీయ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు,బి.సి.గురుకులాలు, తెలంగాణ రాష్ట్ర గురుకులాలు, స్పోర్ట్స్ స్కూల్ లు,మింట్రీ స్కూల్,సైనిక్ స్కూల్ లు, ప్రయివేటు స్కూల్ లు, (నారాయణ, చైతన్య, రవీంద్రభారతి వందేమాతరం, బ్రిలియంట్, గీతం, సెయింట్ పీటర్స్, సెయింట్ జోసెఫ్, సెయింట్ ఫ్రాన్సిస్, లిటిల్ ఫ్లవర్, సెయింట్ మేరీ, సెయింట్ లూయిస్ మొదలైనవి) అనేకం ఉన్నాయి.

త్రిభాషా సూత్రం అమలు జరిగేనా?
భారతీయ విద్యా విధానంలో త్రిభాషా సూత్రం ను అమలు చేస్తున్నారు.ప్రథమ భాషగా మాతృ భాష ( తెలుగు రాష్ట్రాలలో తెలుగు , ఉర్దూ) ద్వితీయ భాషగా హిందీ, తృతీయ భాషగా ఇంగ్లీష్
అనేక పాఠశాలలలో త్రిభాషా సూత్రం ను పాటించకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో మాతృ భాష తెలుగును తప్పని సరి చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేసింది.పదవ తరగతి వరకు తెలుగును తప్పని సరిగా అభ్యసించాలనే నియమ నిబంధనలు రూపొందించినది. అనేక పాఠశాలలలో ప్రభుత్వ ఉత్తర్వులను ఏ మాత్రం ఖాతరు చేయకుండా పదవ తరగతి వరకు తెలుగు చదవకుండానే పదవ తరగతి పూర్తి చేస్తున్నారు. తెలుగుకు బదులుగా సంస్కృతం, రష్యన్, ఫ్రెంచ్, చైనీస్ మిగతా భాషలను చదువుతున్నారు.తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో పదవ తరగతి వరకు తెలుగు భాషను అమలు చేయని పాఠశాలలపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది.అధికారుల నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణి, అవినీతి వలన ప్రయివేటు పాఠశాలలలో ఆడిందే ఆటగా మారింది.

- Advertisement -

ప్రభుత్వ పుస్తకాలను అమలు చేయడం లేదు:-
మన దేశంలో జాతీయ స్థాయిలో ఎన్.సి.ఆర్.టి., రాష్ట్ర స్థాయి లో ఎస్.సి.ఆర్.టి ఉన్నాయి.విద్యార్థుల స్థాయిని బట్టి పాఠ్య పుస్తకాలను రూపొందిస్తారు.విద్యార్థుల స్థాయిని బట్టి, వారి తరగతిని బట్టి పాఠ్య పుస్తకాలను సబ్జెక్టు లో అనుభవం కలిగిన సబ్జెక్టు లో నిష్ణాతులైన వారి చేత పాఠ్య పుస్తకాలను రూపొందించి జాతీయ స్థాయిలో ఎన్.సి.ఆర్.టి.రాష్ట్ర స్థాయిలో ఎస్.సి.ఆర్.టి పుస్తకాలను ఒకటి నుండి పదవ తరగతి వరకు అమలు చేయాలనే ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయి. కొన్ని పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఏ మాత్రం పాటించకుండా పాఠశాల స్థాయిలో పుస్తకాలను రూపొందించి తమ స్వీయ ఎజెండా అమలు చేస్తున్నారు.పదవ తరగతిలో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నందున అనేక ప్రయివేటు పాఠశాలలు పాఠ్య పుస్తకాలను చదివించకుండా కేవలం ప్రశ్న జవాబులను మాత్రమే చదివిస్తూ విద్యార్థులకు మంచి గ్రేడింగ్ రావడానికి ప్రయత్నిస్తున్నారు.విద్యార్థులకు మార్కులు, గ్రేడింగ్ విధానంపై దృష్టి ని కేంద్రీకరిస్తున్నారు.విద్యార్థుల మానసిక, భౌతిక విషయాలపై దృష్టిని కేంద్రీకరించడం లేదు.పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ తరువాత ఇంటర్మీడియట్ ఆ తర్వాత జరగనున్న ఐ.ఐ.టి కోసం మూడు, నాలుగవ తరగతి నుండే ఐ.ఐ.టి బోధన పేరిట విద్యార్థులకు మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారు.

ఫీజు లపై అజమాయిషీ లేదు:-
పబ్లిక్ స్కూల్ లలో, ప్రయివేటు పాఠశాలల్లో ప్రతి సంవత్సరం ఫీజులను తమకు ఇష్టానుసారం పెంచుకుంటుపోతున్నారు.పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఫీజుల భారం ఎక్కువగా ఉంది.కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో ఫీజులను ఖరారు చేసింది.ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వ ఉత్తర్వులను ఖాతరు చేయకుండా అధిక మొత్తాల్లో డబ్బులను ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నారు.విద్యా వ్యాపార సంస్థగా మారింది.

జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి లో కామన్ విద్యా విధానంను అమలు చేయాలి

జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి లలో అధికారులు పిల్లలు, నాయకుల పిల్లలు,పేద, మధ్యతరగతి ప్రజల పిల్లలు చదవడానికి కామన్ విద్యా విధానంను అమలు చేయాలి.జాతీయ స్థాయిలో కేంద్ర కేబినెట్ 2023-24 విద్యా సంవత్సరానికి ఆమోదించిన 1+5+3+4 విద్యా విధానం అన్ని పాఠశాలల్లో అమలు అయ్యేటట్లు చర్యలు తీసుకోవాలి.ప్రభుత్వ పాఠశాలలలో తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన 2022-23 విద్యా సంవత్సరం నుంచి అమలు జరపడం వల్ల అనేక మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదవడానికి ఆసక్తిని చూపిస్తున్నారు.
మన ఊరు -మన బడి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలకు కొత్త ఊపిరిని పోస్తున్నాయి.

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి:-
ఉపాధ్యాయులను వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు.ప్రభుత్వ టీచర్ లు, ఎయిడెడ్ టీచర్లు, ప్రయివేటు టీచర్ లు, విద్యా వాలంటీర్లు, కాంట్రాక్టు టీచర్లు, గురుకుల పాఠశాలల టీచర్లు, మోడల్ స్కూల్ టీచర్ లు అంటూ వేరు వేరు పేర్లతో పిలుస్తున్నారు.ఉపాధ్యాయుల కనీస సమస్యలను పరిష్కరించడం లేదు.ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, సర్వీస్ నిబంధనలు సంవత్సరాల తరబడి పరిష్కారం కాకుండా ఉన్నాయి.తెలంగాణ రాష్ట్రంలో భాషోపాధ్యాయులకు పదోన్నతులు లేక 26,27 సంవత్సరాలు గడిచినా పట్టించుకునే నాథుడే లేడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.భాషోపాధ్యాయులుగా ఉద్యోగ నియామకం జరిగి భాషోపాధ్యాయులుగా పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది.ఉన్నత పాఠశాల లలో బోధిస్తూ ప్రాథమిక పాఠశాల వేతనాలు తీసుకుంటూ వెట్టి చాకిరీ కి, శ్రమదోపిడికి గురౌతున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యా సంబంధిత అధికారులు జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయి లో కామన్ విద్యా విధానం పై దృష్టి ని కేంద్రీకరించి విద్యా వ్యాపారంను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

  • డాక్టర్. ఎస్. విజయ భాస్కర్
    రాష్ట్ర కార్యదర్శి., రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ ( ఆర్.యు. పి.పి.) తెలంగాణ.,9290826988
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు