Friday, May 17, 2024

జాహ్నవి ఘటనపై స్పందించిన వైట్‌హౌస్‌.!

తప్పక చదవండి

న్యూఢిల్లీ : భారతీయ విద్యార్థిని జాహ్నవి కందుల రోడ్డు ప్రమాద ఘటనపై అమెరికా పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తించిన తీరుపై భారత్‌ మండిపడిరది. అటు అమెరికా ఇటు భారత్‌లో కూడా భారత సంతతి వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై శాన్‌ఫ్రాన్సిస్కో ఇండియన్‌ కాన్సులేట్‌ తీవ్రంగా స్పందించింది. దౌత్యాధికారి తరణ్‌జీత్‌ సింగ్‌ సంధూ ఈ విషయాన్ని వాషింగ్టన్‌ డీసీలోని సీనియర్‌ అధికారులు సహా సియాటెల్‌, వాషింగ్టన్‌ రాష్ట్ర అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లారు. జాహ్నవి కేసుపై పోలీసుల దర్యాప్తు తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దీంతో అధ్యక్షుడు బైడెన్‌ స్పందించారు. ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హావిూ ఇచ్చారు. కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్లారు. ఈ ఏడాది జనవరి 23న సౌత్‌లేక్‌ యూనియన్‌ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా పోలీసు పెట్రోలింగ్‌ వాహనం ఢీకొనడంతో ఘటనాస్థలిలోనే మరణించారు. సమయంలో ఆ వాహనాన్ని కెవిన్‌ డేవ్‌ అనే పోలీసు అధికారి నడుపుతున్నారు. దర్యాప్తు నిమిత్తం వచ్చిన పోలీసు అధికారి డానియల్‌ ఆడెరెర్‌ అక్కడే జోకులు వేయడం, నవ్వడం అతని బాడీకామ్‌ కెమెరాలో రికార్డయ్యింది. ఘటన స్థలం నుంచే సియాటెల్‌ పోలీసు ఆఫీసర్స్‌ గిల్డ్‌ అధ్యక్షుడు మైక్‌ సోలెన్‌కు డానియల్‌ ఫోన్‌ చేసి.. ప్రమాద వివరాలు తెలియజేశారు. ‘ఆమె చనిపోయింది’ అని నవ్వడం, ‘ఆమె మామూలు మనిషే. 11 వేల డాలర్ల చెక్కు రాయండి చాలు’ అంటూ నవ్వడం రికార్డయ్యాయి. అంతేకాక ‘వయసు 26 ఉండొచ్చు. ఆమె జీవితానికి విలువ తక్కువ’ అన్నారు. డ్రైవర్‌ తప్పు లేదని, క్రిమినల్‌ దర్యాప్తు అక్కర్లేదని తెలిపారు. జాహ్నవిని ఢీకొట్టిన సమయంలో పెట్రోలింగ్‌ వాహనం 119 కిలోవిూటర్ల వేగంతో ప్రయాణిస్తోంది. సరిగ్గా ఘటన సమయానికి స్పీడో విూటరులో 101 కిలోవిూటర్లు చూపించింది. జీబ్రాలైన్‌లో రోడ్డు దాటుతున్న జాహ్నవి వాహనం తగిలిన ధాటికి 138 అడుగుల అవతల ఎగిరిపడ్డారు. ఈ మార్గంలో 40 కివిూలకి మించి వేగం దాటరాదు. అయితే, వాహనం నడిపిన పోలీసు అధికారి తప్పేం లేదన్నట్టు డానియల్‌ నివేదిక ఇచ్చారు.జాహ్నవి ఘటనపై స్పందించిన వైట్‌హౌస్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు