హైదరాబాద్ : టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టికెట్లను కోట్ల రూపాయలకు అమ్ముకున్నారని గద్వాల్ కాంగ్రెస్ నేత కురువ విజయ్ కుమార్ ఈడీకి ఫిర్యాదు చేశారు. టికెట్లు అమ్ముకున్న డబ్బులతో మనీ ల్యాండరింగ్ జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు విజయ్ కుమార్. రేవంత్ రెడ్డిపై సమగ్ర విచారణ జరపాలని ఈడీకి విజ్ఞప్తి చేశారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో రాత్రికి రాత్రి బేరం కుదుర్చుకొని కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపులో రేవంత్ రెడ్డి కోట్లాది రూపాయలు తీసుకున్నాడని విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ సందర్భంగా వెంటనే విచారణ జరిపించాలంటూ హైదరాబాద్లోని ఈడీ జాయింట్ డైరెక్టర్కు సాక్షాలతో సహా ఫిర్యాదు చేశారు. గద్వాల చెందిన కురువ విజయ్ కుమార్, బహుదూర్ పురా నియోజకవర్గానికి చెందిన ఖాలిమ్ బాబాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేతలు కూడా రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.