- ఆదివారం మధ్యాహ్నం 3.1 తీవ్రతతో భూకంపం..
- భయాందోళనలకు గురైన ప్రజలు..
- ఇళ్లల్లోని సామాగ్రి ఊగిపోయిన వైనం..
న్యూ ఢిల్లీ : హర్యానాలోని ఫరీదాబాద్లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్సోలజీ తెలిపింది. ఫరీదాబాద్ ఈస్ట్కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు పేర్కొంది. ఈ ప్రభావంతో ఢిల్లీ -ఎన్సీఆర్ పరిధిలో భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలకు గురికాగా, ఇళ్లలోని సామాగ్రి ఊగిపోయినట్టు పలువురు స్థానికులు తెలిపారు. దేశ రాజధానిలో భూ ప్రకంపనలు సంభవించడం గత పదిహేను రోజుల్లో ఇది రెండోసారి.