Sunday, May 19, 2024

వణికిన ఢిల్లీ ..

తప్పక చదవండి
  • ఆదివారం మధ్యాహ్నం 3.1 తీవ్రతతో భూకంపం..
  • భయాందోళనలకు గురైన ప్రజలు..
  • ఇళ్లల్లోని సామాగ్రి ఊగిపోయిన వైనం..

న్యూ ఢిల్లీ : హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం 4.08 గంటలకు 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్సోలజీ తెలిపింది. ఫరీదాబాద్‌ ఈస్ట్‌కు తొమ్మిది కిలోమీటర్లు, ఆగ్నేయ ఢిల్లీకి 30 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్టు పేర్కొంది. ఈ ప్రభావంతో ఢిల్లీ -ఎన్‌సీఆర్‌ పరిధిలో భూమి కంపించింది. ప్రజలు భయాందోళనలకు గురికాగా, ఇళ్లలోని సామాగ్రి ఊగిపోయినట్టు పలువురు స్థానికులు తెలిపారు. దేశ రాజధానిలో భూ ప్రకంపనలు సంభవించడం గత పదిహేను రోజుల్లో ఇది రెండోసారి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు