Friday, May 17, 2024

బాత్రూం కిటికీ నుంచి పారిపోయిన యువతి

తప్పక చదవండి

హైదరాబాద్‌ :స్టేట్‌హోంలో ఆశ్రయం పొందుతున్న యువతి అదృశ్యమైన సంఘటన హైదరాబాద్‌ లోని మధురానగర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. మల్లీశ్వరీ అనే యువతి కొంతకా లంగా మధురానగర్‌ డివిజన్‌ పరిధిలోని స్టేట్‌హోంలో ఉంటూ సవిూపంలోని ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ సెకెండ్‌ ఇయర్‌ చదువుతోంది. కాగా కడప జిల్లాకు చెందిన ప్రవీణ్‌ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రాంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం ఆర్థ రాత్రి తన గది నుంచి బాత్రూం కిటికీలోనుంచి దూకి పారిపోయింది. తాను ప్రవీణ్‌ అనే యువకుడి ని ప్రేమించానని, అతనితో పాటు వెళుతున్నట్లు ఉత్తరంలో పేర్కొంది. స్టేట్‌హోం ఇన్‌చార్జి ముంతా జ్‌బేగం ఫిర్యాదు మేరకు మధురానగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు