లక్నో : విద్యార్థిని శిక్షించిన ఒక టీచర్పై తండ్రి దాడి చేశాడు. ఉపాధ్యాయుడిపై పిడిగుద్దులు గుద్దాడు. స్కూల్ సిబ్బంది జోక్యం చేసుకుని ఆ వ్యక్తిని నిలువరించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ విూడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఈ సంఘటన జరిగింది. 5వ తరగతి చదువుతున్న విద్యార్థిని ఒక ఉపాధ్యాయుడు దండిరచాడు. బాలుడితో 50కుపైగా గుంజీలు తీయించాడు. దీంతో ఆ విద్యార్థి కాలు వాచిపోయింది. ఆ బాలుడు ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ నేపథ్యంలో విద్యార్థి తండ్రి కొందరు వ్యక్తులతో కలిసి ఆ స్కూల్కు వెళ్లాడు. ప్రిన్సిపాల్ ఆఫీస్లో ఉన్న టీచర్పై దాడి చేశాడు. అతడిపై పిడిగుద్దులు కురిపించాడు. కాగా, ఆ స్కూల్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకున్నారు. టీచర్పై దాడి చేసిన విద్యార్థి తండ్రిని సముదాయించారు. అతడ్ని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ గదిలో ఉన్న విద్యార్థి కూడా తండ్రి తీరు చూసి షాక్ అయ్యాడు. రోవైపు ఈ సంఘటనపై ఆ స్కూల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రిన్సిపాల్ ఆఫీస్లోని సీసీటీవీలో రికార్డు అయిన వీడియో ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ విూడియాలో వైరల్ అయ్యింది.