Saturday, April 27, 2024

త్వరలోనే తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాలు

తప్పక చదవండి

పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న తెలంగాణ గ్రూప్‌-4 ఫలితాల విడుదలకు రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 8,180 గ్రూప్‌-4 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఫలితాలు మెరిట్‌ జాబితాను వెలువరించేందుకు టీఎస్‌పీఎస్సీ సిద్ధమైంది. ఈ ఏడాది జులై 1న రాతపరీక్ష నిర్వహించగా.. రాష్ట్రవ్యాప్తంగా 7.6 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. దీనికి సంబంధించి తుది కీ వెల్లడించింది. ఇందులో పేపర్‌-1లో ఏడు ప్రశ్నలు, పేపర్‌-2లో మూడు కలిపి మొత్తం పది ప్రశ్నలు తొలగించింది. రెండు పేపర్లలో మొత్తం 13 ప్రశ్నల సమాధానాల్లో మార్పులు చేయగా.. ఇందులో అయిదింటికి ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలను సరైనవిగా పేర్కొంది. ఫైనల్‌ కీ వెల్లడి కావడంతో అభ్యర్థుల జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తిచేసింది. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితా వెల్లడించాలని కమిషన్‌ భావిస్తోంది. పరీక్ష రాసిన అభ్యర్థులు పొందిన మార్కుల వివరాలు, జిల్లా స్థానికత, కేటగిరీ తదితర వివరాలు ఈ జాబితాలో ఉండనున్నాయి. దసరా పండగ తరువాత మెరిట్‌ జాబితా ఇవ్వాలని కమిషన్‌ భావిస్తున్నట్లు సమాచారం. మహిళలకు సమాంతర రిజర్వేషన్లపై హైకోర్టు స్పష్టతనిచ్చాక.. ఎన్నికల కోడ్‌ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం తుది ఎంపిక జాబితాలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే స్పష్టత కోసం మరికొన్నిఆగాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో ఉన్న గ్రూప్-4 ఖాళీలను భర్తీ చేయడానికి గతేడాది డిసెంబరులో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి. టీఎస్పీఎస్సీ 8,180 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ చేయగా.. ఈ ఏడాది జులై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షను రికార్డు స్థాయిలో 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 7 లక్షల 60 వేల మంది అభ్యర్థులు పరీక్షను రాశారు. ఈ పరీక్షకు సంబంధించిన తుది కీని టీఎస్పీఎస్సీ అక్టోబరులో విడుదల చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు