భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ కోసం టీమ్ ఇండియా క్టోబర్ 15 (ఆదివారం)న అహ్మదాబాద్ నుంచి పూణేకి వెళ్లింది. టీమ్ ప్లేయర్లు పూణెకు వెళ్లే విషయాన్ని బీసీసీఐ తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ప్రపంచకప్లో ఆడిన మూడు మ్యాచ్ల్లోనూ విజయం సాధించిన టీమిండియా బంగ్లాదేశ్పై తన విజయ పరంపరను కొనసాగించాలని పట్టుదలతో ఉంది. ముఖ్యంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను మట్టికరిపించిన రోహిత్ శర్మ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపు కావడం ఆ జట్టుకు ప్లస్ పాయింట్గా మారింది. ప్రపంచకప్లో ఇప్పటివరకు ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్లను టీమిండియా ఓడిరచింది. ఇప్పుడు పూణెలో బంగ్లాదేశ్తో జరిగే మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా రోహిత్ సేన వరుసగా నాలుగో విజయంపై కన్నేసింది. బ్యాటింగ్ విభాగంలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన టచ్లో ఉన్నాడు. శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. ఓపెనర్ శుభ్మాన్ గిల్ కూడా పాకిస్థాన్పై బరిలోకి దిగాడు. గిల్ బంగ్లాదేశ్తో కూడా ఆడాలని భావిస్తున్నారు. మరోవైపు టోర్నీలో బంగ్లాదేశ్కు శుభారంభం దక్కలేదు. గత మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై షకీబ్ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. తద్వారా పటిష్టమైన భారత్ను ఓడిరచి టోర్నీలో తిరిగి గెలుపు బాటలోకి రావాలనే లక్ష్యంతో బంగ్లాదేశ్ బరిలోకి దిగుతోంది. ఇరుజట్ల మధ్య పూణెలోని ఎం.సి.ఏ. స్టేడియంలో అక్టోబర్ 19 (గురువారం)న ఇరు జట్లు తలపడనున్నాయి. టోర్నీలో బంగ్లాదేశ్ను బలమైన జట్టుగా పరిగణించనప్పటికీ, పెద్ద జట్లను షాక్ ఇవ్వడంలో నిష్ణాతులుగా మారింది. ఈసారి ఈవెంట్లో షకీబ్ అల్ హసన్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. అతని నాయకత్వంలో జట్టు 3 మ్యాచ్లు ఆడిరది. రెండు ఓడిపోయింది. ఒకటి గెలిచింది. బంగ్లాదేశ్ను తేలికగా తీసుకోవడంలో భారత జట్టు ఎలాంటి తప్పు చేయదు. టోర్నీ చరిత్రలో ఇరుజట్ల మధ్య నాలుగు మ్యాచ్లు జరగ్గా అందులో భారత్ 3 మ్యాచ్ల్లో విజయం సాధించింది. బంగ్లాదేశ్ ఒక మ్యాచ్లో విజయం సాధించింది. 2007 ప్రపంచకప్లో బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.