Saturday, July 27, 2024

రేవంత్ రెడ్డి పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి..

తప్పక చదవండి
  • బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్
    హైదరాబాద్ : ఎంపీ రాహుల్ గాంధీ భారతదేశం అంతటా ‘నఫ్రత్ కా బజార్ మే మొహబ్బత్ కా దుకాన్’ గురించి మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తున్న విద్వేష రాజకీయాలకు రాహుల్ గాంధీ , ఏఐసీసీ నిస్సందేహంగా మద్దతు ఇస్తున్నాయి. అధికారంలోకి వస్తే పోలీసులను బట్టలు విప్పి కొడతానని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్‌ తీవ్రంగా పరిగణించారు. ఇది రేవంత్ రెడ్డి అనాగరిక, ఆటవి వైఖరికి నిదర్శనమని, ప్రజాస్వామ్య దేశంలో ఇంతటి భాద్యతరాహిత్యమైన మాటలు దురదృష్టకరమని పేర్కొన్నారు. రేవంత్ అసాంఘిక, నేరపూరిత ప్రవర్తనపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన డాక్టర్ దాసోజు శ్రవణ్.. రేవంత్ రెడ్డి పదే పదే చేస్తున్న చట్టవిరుద్ధమైన చర్యలు, హింసాత్మక బెదిరింపులపై ఏఐసీసీ నాయకత్వం ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు. ప్రేమని పంచుదామని మాట్లాడుతున్న రాహుల్ గాంధీ ఒక విషయం తెలుసుకోవాలి. సీఎం కేసీఆర్ ఇప్పటికే తెలంగాణను అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, సామరస్యంగా జీవించే ‘మొహబ్బత్ కా బజార్’గా మార్చారు. రేవంత్ రెడ్డి ఇందులో నఫ్రత్ గా దుకాన్’ నడపాలని ప్రయత్నిస్తున్నారు. ఇది కాంగ్రెస్ కి బ్యాక్ ఫైర్ అవుతుంది తప్పితే .. కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేరని పేర్కొన్నారు దాసోజు. గతంలోనూ రేవంత్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, గౌడ, పిచ్చుకుంట్ల, యాదవ, నాయీబ్రాహ్మణులు, ట్రాన్స్‌జెండర్లు తదితర వర్గాలకు చెందిన వారిని కూడా బెదిరించారని, అవమానించారని గుర్తు చేసిన దాసోజు.. పోరేవంత్ రెడ్డి పోలీసులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘అహింస’, ‘సత్యాగ్రహం’ వంటి గాంధీ సిద్ధాంతాలని భరోసా ఇస్తున్న 125 ఏళ్ల కాంగ్రెస్ నాయకత్వం,, హింసాత్మక మార్గాల ద్వారా అత్యంత ప్రజాదరణ కలిగిన, ప్రజలకు స్నేహపూర్వకమైన నాయకుడైన కేసీఆర్‌ను గద్దె దించగలదని నమ్ముతోందా? తెలంగాణా ప్రజల నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు ఎంత దూరమయ్యారో ఇదే రుజువుచేస్తోంది ” అన్నారు దాసోజు శ్రవణ్. రేవంత్ రెడ్డి యొక్క రౌడీ వ్యూహాలు కేసీఆర్ హ్యాట్రిక్ విజయాన్ని ఆపలేవని ఉద్ఘాటించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు