Tuesday, May 7, 2024

పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు.. ఖైదీలు పరార్‌

తప్పక చదవండి

లక్నో : ఒక చోట పోలీస్‌ వ్యాన్‌ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్‌లో ఉన్న ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని పారిపోయారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని రaాన్సీలో ఈ సంఘటన జరిగింది. రైల్వే స్టేషన్‌లో చోరీలకు పాల్పడి అరెస్టైన ఏడుగురు రిమాండ్‌ ఖైదీలను ఈ నెల 19న రaాన్సీ రైల్వే కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా ఒక చోట పోలీస్‌ వ్యాన్‌ను నిలిపిన పోలీసులు టీ తాగేందుకు వెళ్లారు. అయితే ఖైదీలున్న ఆ వ్యాన్‌ వద్ద గస్తీగా పోలీసులు ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో ఆ వ్యాన్‌లో ఉన్న ఏడుగురు ఖైదీల్లో ముగ్గురు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డు అయిన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ విూడియాలో వైరల్‌ అయ్యింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు