Monday, May 6, 2024

కెసిఆర్ పాలనను అంతమొందించడం కాంగ్రెస్ తోనే సాధ్యం..

తప్పక చదవండి
  • వెల్లడించిన మందమల్ల పరమేశ్వర్ రెడ్డి

నాచారం : తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మందమల్ల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. మల్లాపూర్ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం.. నెమలి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మందమల్ల పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ రాక్షస పాలన అంతమొందించాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సబ్బండ వర్గాలకు న్యాయం జరగాలని, తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇస్తే కేవలం కుటుంబ పాలన కొనసాగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ కుమార్ గౌడ్, సంజీవరెడ్డి, యువజన నాయకులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు