Saturday, May 18, 2024

బీ.ఆర్.ఎస్. లో చేరిన పలువురు కాంగ్రెస్ టీడీపీ నేతలు..

తప్పక చదవండి
  • కండువా కప్పి ఆహ్వానించిన జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి

లింగాల గణపురం : లింగాల ఘనపూర్ మండలం, కొత్తపల్లి గ్రామంలో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కడియం శ్రీహరి నాయకత్వాన్ని బలపరుస్తూ పార్టీ చేస్తున్న సంక్షేమ అభివృధి పథకాల అమలుతో పాటుగా పార్టీ అభ్యర్థిపై నమ్మకంతో శుక్రవారం రోజు జెడ్పీటీసీ గుడి వంశిధర్ రెడ్డి అధ్వర్యంలో పార్టీలో చేరారు టీడీపీకి చెందిన మంతెన కిష్టయ్య, కాంగ్రెస్ కి చెందిన గర్వందుల ప్రభాకర్, జనగాం బుచ్చమ్మ.. వారితో పాటుగా యువత 40 మందికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు…వారితో పాటుగా స్థానిక సర్పంచ్ తుంగ స్రవంతి, నాగరాజు, పార్టీ గ్రామ అధ్యక్షులు జగ్గిలపురం యాదగిరి, మాజీ సర్పంచ్ వంగ శ్రీనివాస్, గాదపక విష్ణు, జనగాం యాదగిరి, స్వామి, తదితరులు ఉన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు