- రూ 5.50 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో నియోజకవర్గంలో పార్కులు అభివృద్ధి పరిచాం
కూకట్పల్లి : ఆదివారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు నియోజకవర్గంలోని బాలాజీ నగర్.. కెపిహెచ్బి డివిజన్లలో వివిధ అభివృద్ధి కార్యక్రమా లను ప్రారంభించారు. ఇందులో భాగంగా మొత్తం రూ 5.50కోట్లతో పార్కులు అభివృద్ధి చేసే అన్నారు. అనంతరం కెపిహెచ్బి డివిజన్లోని క్రిస్టియన్ గ్రేవ్ యార్డులోని వెయిటింగ్ రూమ్ ప్రారం భించారు. అనంతరం 7వ ఫేస్ లోని ఎనర్జీ పార్క్ ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యమే పరమావధిగా ముందుకు వెళ్తున్నారని వారి సహాయ సహకారాలతో కూకట్పల్లి నియోజక వర్గంను అభివృద్ధి అని అన్నారు.. అలాగే పిల్లలకు ఈ పార్కుల ద్వారా విజ్ఞానం కలుగుతుందని ఒక్కొక్క పార్కు ఆహ్లాదంతో పాటు ఆరోగ్యం విజ్ఞానన్ని అందించే విధంగా తీర్చిదిద్దామని తెలిపారు. 7వ ఫేస్ లో రూపొందించిన సోలార్ ఎనర్జీ పార్క్ పిల్లలకు చూపించడం ద్వారా వారికి సోలార్ ఎనర్జీ గురించి విద్యుత్ వినియోగం గురించి అవగాహన కలుగుతుందని పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ విధంగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఇటువంటి థీమ్పా పార్కులను రూపొందిస్తున్నామని అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ఆదర్శ నియోజకవర్గంగా మారుతుందని అన్నారు.. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పగడాల శిరీష బాబురావు.. మందడి శ్రీనివాసరావు ఈఈ సత్యనారాయణ.. డి ఈ ఆనంద్ .. ఏ ఈ సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.