Friday, May 17, 2024

ముఖేష్ మళ్ళి బెదిరింపుఈ-మెయిల్..

తప్పక చదవండి
  • రిలయన్స్ అధినేతకు వరుస బెదిరింపు మెయిల్స్
  • తొలుత రూ.20 కోట్లు డిమాండ్ చేసిన ఆగంతకుడు
  • ఇప్పుడు రూ.200 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని హెచ్చరిక
  • కాల్చి చంపుతామని బెదిరింపులకు దిగిన నిందితులు
  • ఒకే మెయిల్ అకౌంట్ నుంచి రెండుసార్లు బెదిరింపు

ముంబై : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీకు వస్తున్న మెయిల్ బెదిరింపులు కలవరం రేపుతున్నాయి. ఒకదానివెంట ఒకటిగా రెండు సార్లు ఒకే వ్యక్తి నుంచి బెదిరింపు మెయిల్ రావడంతో ఆందోళన వ్యక్తమౌతోంది. వరుసగా రెండ్రోజులు రెండు సార్లు చంపేస్తామని బెదిరిస్తూ మెయిల్ రావడం కలకలం రేపుతోంది. అక్టోబర్‌ 27న రూ.20 కోట్లు డిమాండ్‌ చేస్తూ బెదిరింపు మెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. తాము కోరినంత ఇవ్వకపోతే మా వద్ద మంచి షూటర్లున్నారంటూ ఆగంతకులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై ముకేశ్ అంబానీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో తాజాగా మరోసారి బెదిరింపు మెయిల్‌ను పంపారు. తొలి పంపిన మెయిల్‌కి స్పందించకపోవడంతో రూ. 200 కోట్లు డిమాండ్‌ చేస్తున్నట్లు తాజా మెయిల్‌లో పేర్కొన్నారు.

తాము కోరినంత ఇవ్వకుంటే కాల్చి చంపుతామని బెదిరింపులకు దిగారు. ముకేశ్ అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రెండు మెయిల్స్‌ ఒకే ఖాతా నుంచి వచ్చాయని, షాదాబ్ ఖాన్‌ అనే వ్యక్తి బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. అతడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గతేడాది కూడా అంబానీ కుటుంబానికి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. 2022 ఆగస్టు 15న రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలోని హర్‌కిసాన్‌దాస్‌ ఆస్పత్రికి బెదిరింపు ఫోన్‌ వచ్చింది. ఆసుపత్రిని పేల్చేస్తామని, అంబానీ కుటుంబాన్ని చంపేస్తామని ఆగంతుకుడు బెదిరించాడు.

- Advertisement -

దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, 2021లో అంబానీ నివాసం ఆంటిలియా సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటన జరిగిన వారం రోజులకే వాహనం యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో మృతిచెందాడు. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజేయే ప్రధాన సూత్రధారిగా తెలిపింది. దీంతో వాజేను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఈ ఘటన తర్వాత నుంచి ముకేశ్‌ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులకు కేంద్రం భద్రత కల్పిస్తోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు