Saturday, July 27, 2024

సి‌పి‌ఐ జాతీయ నాయ‌కుల‌తో మ‌ల్లు ర‌వి

తప్పక చదవండి

సి‌పి‌ఐ జాతీయ కార్యదర్శి డి.రాజ, సి‌పి‌ఐ సెంట్రల్ కమిటీ సభ్యులు కె నారాయణని, మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషాని న్యూడిల్లీలోని సి‌పిఐ జాతీయ కార్యాలయంలో టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి డా.మల్లు రవి మర్యాదపూర్వకంగా కలిసి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రానికి చెందిన అనేక అంశాలు కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్నాయని, తెలంగాణకు సైనిక్ స్కూల్, కంటోన్మెంట్ వద్ద రక్షణ శాఖ భూములు సహా నీటి ప్రాజెక్టులు, ఆర్థిక, రక్షణ శాఖకు చెందిన అనేక అంశాలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. తెలంగాణ పెండింగ్‌ అంశాల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీవీ ప్రధాన కార్యదర్శులు నర్సారెడ్డి భూపతి రెడ్డి, సింగం చరణ్ కౌశిక్ యాదవ్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఇంచార్జ్ ఎలుగొండ మధుసూధన్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు