- నోరు అదుపులో పెట్టుకో మల్లారెడ్డి
- మాజీ ఎమ్మెల్యే కిచన్న గారి లక్ష్మరెడ్డి హెచ్చరిక
మేడ్చల్ : గురువారం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో కె ఎల్ ఆర్ వెంచర్ లోని క్లబ్ హౌస్ లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ కల్తీ పాల మల్లన్న కల్తీ మాటలు ఆపాలని అన్నారు. సొంత పార్టి లొనే మీ మేయర్లు ,కార్పొరేటర్లు, మున్సిపాలిటీ చైర్మన్లు డబ్బు లు ఎలా అయితే వల్ల దగ్గర టికెట్ విషయంలో వసూలు చేసావో తిరిగి ఎన్నికల సమయంలో నీ నుండి కూడా అంత కంటే పెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని తుక్కు తుక్కు ఓడిస్తారని అన్నారు. సర్వే చేసుకో మల్లన్న అంటూ సవాలు విసిరారు.ఊరు ఊరూరా జోకర్ మల్లారెడ్డి అని మాట్లాడుతు న్నారని మంత్రిగా వుంటూ చిల్లర మాటలు మాట్లాడుతూ చిల్లర వ్యక్తిగా మరిపోతున్నవాని అన్నారు.రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో గెల పో తుందని రంగారెడ్డి జిల్లాలో పార్టీ బలోపేతమే దిశగా ముందుకు సాగు తు న్నానని అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షుడు వరదా రెడ్డి,ఏ-బ్లాక్ అధ్యక్షుడు పోచయ్య,గుండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారి నరేందర్,నారెడ్డి, కొండల్ రెడ్డి, కౌన్సిలర్ చేపరాజు,మాజీ మండల పార్టీ యూత్ అధ్యక్షుడు రేగు రాజు,దొండ్ల మోహన్, మధుకర్ ,పాషా, కిసాన్ సెల్ అధ్యక్షుడు రామకృష్ణ రెడ్డి,మేడ్చల్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు తాముటం రాము,బాపురెడ్డి, నిషిత రెడ్డి, బలరాం రెడ్డి, నాగా ర్జున రెడ్డి, మానిక్ రెడ్డి, సాయికుమార్లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-