- ప్రేమించాలంటూ బాలిక వెంటపడిన నిందితుడు
- ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో అఘాయిత్యం..
- ఆ తరువాతం విద్యానగర్ లో రైలు కిందపడి ఆత్మహత్య
ప్రేమించాలని బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శుక్రవారం నాడు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్ విద్యానగర్ లో చోటు చేసుకుంది. ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా పదో తరగితి బాలిక వెంటపడిన నిందితుడు అందుకు ఒప్పు కోకపోవడంతో కత్తితో దాడి చేశాడు. ఆపై తాను రైలు కిందపడి ఆత్మహత్య కు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. రమణ అనే నిందితుడు ఓ బాలికను ప్రేమించాలని వెంటపడి వేధించాడు. అందుకు బాలిక ఒప్పుకోలేదు. దీంతో ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో గురువారం ట్యూషన్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేశాడు. అడ్డు వచ్చిన ట్యూషన్ టీచర్పైనా దాడి చేసి రమణ పరారయ్యాడు. ఈ ఘటనతో షాక్ కు గురైన ఇతర స్టూడెంట్స్ కేకలు వేశారు. స్థానికులు రావడంతో నిందితుడు పారిపోయాడని పోలీసులు చెప్పారు. దాడిలో గాయపడిన బాలిక, ట్యూషన్ టీచర్ను దవాఖానకు తరలించారు. ఇవాళ ఉదయం నిందితుడు ఆత్మహత్య చేసుకున్నట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.