Saturday, May 18, 2024

బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

తప్పక చదవండి

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. ఆలేరు నియోజకవర్గంలోని ఆలేరు పట్టణం, ఆలేరు మండలం శ్రీనివాసపురం ఉపసర్పంచ్, పటేల్ గూడెం పిక్క శ్రీను మాజీ ఎంపీటీసీ, గ్రామ మాజీఉప సర్పంచ్ లత రమేష్, బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ సురేష్, బొమ్మాలరామరం మండలం వాలు తాండ నుండి, గుండాల మండలం అనంతరం, పెద్దపడిశాల వస్తా కొండూరు గ్రామాల నుండి పెద్దఎత్తున్న కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా చేరిన వారు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో బీర్ల ఐలయ్యని భారీ మెజారిటీతో తో గెలిపిస్తామన్నరూ… బీర్ల ఐలయ్య చేసిన సేవ కార్యక్రమాలు, కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లను చూసి ఆకర్షితులై బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ లోకి చేరామని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు