అనంతనాగ్ : జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలలో వేర్పాటువాద ఉగ్రవాదుల ఏరివేతకు వేట కొనసాగుతోంది. ముగ్గురు జవాన్లను పొట్టనపెట్టుకున్న టెర్రరిస్టుల ఏరివేతకు ఆర్మీ ఆపరేషన్ తిరిగి ప్రారంభమైంది. కోకెర్నాగ్ అటవీ ప్రాంతంలో గురువారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ జరుగుతోంది. లష్కరే తాయిబాకు చెందిన కార్యకర్త ఉజైర్ ఖాన్ అనే స్థానికుడితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు సమాచారం. టెర్రరిస్టులతో బుధవారం రాత్రి జరిగిన కాల్పుల్లో మన ఆర్మీ ఆఫీసర్లు కల్నల్ మన్ప్రీత్ సింగ్ , మేజర్ అశిష్ ధోనాక్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ హుమాయూన్ భట్ ప్రాణాలు కోల్పోయారు.