Tuesday, May 7, 2024

చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగుల నిరసన..

తప్పక చదవండి
  • సాంకేతిక విజ్ఞాన గని చంద్రబాబు అరెస్ట్ అమానుషం..
  • బాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి అయ్యింది..
  • అక్రమకేసులు ఎత్తేసి ఆయన్ను విడుదల చేయాలి..
  • విప్రో సర్కిల్ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు భారీ ర్యాలీ..
  • ఐటీ అంటే బాబు.. బాబు అంటే ఐటీ అంటూ ఫలకార్డుల ప్రదర్శణ..
  • బాబు మచ్చలేకుండా తిరిగివస్తారని ట్వీట్ చేసిన దర్శకులు రాఘవేంద్ర రావు..

హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు చలువే.. లక్షలమంది నిరుద్యోగులకు ముందుచూపుతో చర్యలు తీసుకున్న నాయకుడు చంద్రబాబు.. ఆయన అరెస్ట్ సమాజానికి విఘాదం.. ఆయన మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐటీ ఉద్యోగులు బుధవారం హైదరాబాద్ లో నిరసన ర్యాలీ చేపట్టారు..

హైదరాబాద్: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు ఆందోళన నిర్వహించారు. ‘చంద్రబాబు వల్లే హైదరాబాద్‌లో ఐటీ అభివృద్ధి చెందింది. ఆయన వల్లే మాకు ఉపాధి అవకాశాలు వచ్చాయి. మా జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రబాబుకు అండగా ఉంటాం’ అని ఉద్యోగులు పేర్కొన్నారు. చంద్రబాబును అవినీతి ఆరోపణలపై అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేసి ఆయణ్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు. విప్రో సర్కిల్‌ నుంచి ఔటర్‌ రింగ్‌ రోడ్డు వరకు బుధవారం మధ్యాహ్నం భారీ ర్యాలీ నిర్వహించారు. ‘ఐటీ అంటే బాబు.. బాబు అంటే ఐటీ’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అమలు చేసిన ఐటీ విధానాలను విదేశాలు సైతం స్ఫూర్తిగా తీసుకున్న సందర్భాలు ఉన్నాయని టీడీపీ అభిమాని అయిన ఒక యువతి అన్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కూకట్‌పల్లిలోనూ ఐటీ ఉద్యోగులు, సెటిలర్లు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఐటీ సర్కిల్‌లో ఉద్యోగులు ఈ ఆందోళన నిర్వహించారు. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. ఆందోళనకు దిగిన ఐటీ ఉద్యోగులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -

‘వచ్చే ఎన్నికల్లో మా తడాఖా చూపిస్తాం’ అంటూ కొంత మంది ఐటీ ఉద్యోగులు హెచ్చరించారు. మరోవైపు.. చంద్రబాబు నాయుడు అరెస్టుపై దర్శకుడు రాఘవేంద్రరావు స్పందించారు. చంద్రబాబు ఎలాంటి మచ్చ లేకుండా జైలు నుంచి తిరిగొస్తారని ట్వీట్ చేశారు. ‘వేంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో అలిపిరి బాంబ్ బ్లాస్ట్ నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు క్షేమంగా ఎలా అయితే బతికి బయట పడ్డారో.. ఇప్పుడు కూడా ఆ స్వామి వారి ఆశీస్సులతోనే ఎలాంటి బ్లాక్ మార్క్ లేకుండా జైలు నుంచి తప్పకుండా బయటకు వస్తారు’ అని రాఘవేంద్రరావు ట్వీట్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు