Tuesday, April 30, 2024

ఐటీ కారిడార్‌లో రేపటి నుంచి ‘లేడీస్‌ స్పెషల్‌’ బస్సు..!

తప్పక చదవండి

టీఎస్‌ ఆర్టీసీ మహిళల కోసం నేటి నుంచి ప్రత్యేకంగా బస్సులు నడుపనున్నది. ఐటీ కారిడార్‌లో మహిళా ఉద్యోగుల కోసం ‘మెట్రో ఎక్స్‌ప్రెస్‌ లేడీస్‌ స్పెషల్‌’ బస్సును అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి వేవ్‌ రాక్‌ వరకు పైలెట్‌ ప్రాజెక్టులో భాగంగా నడుపనున్నది. హైదరాబాద్‌ నగర పరిధిలో ఉన్న ఐటీ కంపెనీల్లో దాదాపు 5లక్షల మంది వరకు మహిళా ఉద్యోగులు పని చేస్తున్నట్లుగా అంచనా. వారి కోసం ప్రత్యేకంగా బస్సులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పెలైట్‌ ప్రాజెక్టుగా సోమవారం నుంచి బస్‌ను నడుపనున్నది.

ఈ బస్సు జేఎన్‌టీయూ నుంచి ఉదయం 9.05 గంటల నుంచి బయలుదేరరి బస్సు నెక్సస్ మాల్, హైటెక్ సిటీ, మైండ్‌స్పేస్, రాయదుర్గం, బయో డైవర్సిటీ పార్క్, గచ్చిబౌలి ఎక్స్‌రోడ్, ఇందిరా నగర్, ఐఐటీ ఎక్స్ రోడ్, విప్రో సర్కిల్, ఐసీఐసీఐ టవర్స్ మీదుగా వెళ్తుంది. తిరిగి సాయంత్రం 5.50 గంటలకు వేవ్‌ రాక్‌ నుంచి ఆయా మార్గాల ద్వారా జేఎన్‌టీయూకు చేరుకుంటుంది. ప్రయోగాత్మకంగా నడుపుతున్న సర్వీసు విజయవంతమైతే మరిన్ని మార్గాల్లో నడిపించాలని ఆర్టీసీ భావిస్తున్నది. కొత్తగా అందుబాటులోకి వస్తున్న ప్రత్యేక బస్సును మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ విజ్ఞప్తి చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు