న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా 75వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఢల్లీిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం సైనికుల కవాతు, శకటాల ప్రదర్శన జరిగాయి. ఈ సందర్భంగా వివిధ రాష్టాల్రు, కేంద్ర పాలిత ప్రాంతాల సంస్కృతి, సంప్రదాయాలు, అభివృద్ధి తదితర అంశాలను చూపిస్తూ శకటాల ప్రదర్శన జరిగింది. తెలంగాణకు చెందిన శకటం విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ పోరాట యోధుల థీమ్తో దీన్ని రూపొందించారు. పల్లెటూరు వాతావరణాన్ని ప్రతిబింబించేలా డిజైన్ ఉంది.