Friday, May 3, 2024

సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ

తప్పక చదవండి
  • బాధ్యతలు స్వీకరించిన మహేందర్‌ రెడ్డి
  • పది నెలల పాటు కొనసాగనున్న మహేందర్‌ రెడ్డి
  • టీఎస్‌పీఎస్సీ సభ్యులుగా ఐదుగురి నియామకం

హైదరాబాద్‌ : తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు సెక్రెటరీ అనితారామచంద్రన్‌ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సభ్యులుగా పాల్వాయి రజనీకుమారి, అనితారాజేంద్రతో మహేందర్‌రెడ్డి ప్రమాణం చేయించారు. రెండురోజుల కిందట టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌గా నియమిస్తూ గవర్నర్‌ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. కొత్తగా చైర్మన్‌ నియమితులైన మహేందర్‌రెడ్డి ఆ పదవిలో 11 నెలల పాటు కొనసాగనున్నారు. టీఎస్‌పీఎస్‌పీ నిబంధనల ప్రకారం చైర్మన్‌గా.. కమిషన్‌ సభ్యులుగా నియమితులైన వారు 62 ఏండ్లు వచ్చేవరకు మాత్రమే పదవిలో కొనసాగేందుకు అవకాశం ఉంది. అలాగే ఆరేళ్ల పాటు మాత్రమే ఆ పదవిలో కొనసాగాల్సి ఉంటుంది. 1962లో డిసెంబర్‌3న జన్మించిన మహేందర్‌రెడ్డికి ప్రస్తుతం ఆయనకు 61 సంవత్సరాలు. ఇంకో 11 నెలలు ఆయనకు 62 సంవత్సరాలకు చేరుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన 11 నెలల పాటు పదవిలో కొనసాగనున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు