- గజ్వేల్ లో కెసిఆర్ ను చిత్తుగా ఓడిరచాలి
- కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆడ బిడ్డలకు రూ.2500
- కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు ఇస్తాం
- చదువకునే పిల్లలకు రూ.5లక్షల రుణ సౌకర్యం
- ఎన్నికల ప్రచార సభలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు నమ్మి ఓటేస్తే నిండా మంచిండని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం గజ్వేల్ పట్టణంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి కి మద్దతుగా తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్ చరిత్ర మొత్తం పారిపోవుడే అని..సిద్దిపేట నుండి కరీంనగర్ కు, మహబూబ్ నగర్ కు పోయాడన్నారు. చివరికి గజ్వేల్ ప్రజలు రెండు సార్లు గెలిస్తే మల్లన్న సాగర్ లో ప్రజలను నిండా ముంచిండు, కొండపోచమ్మ సాగర్ లో దోచుకున్నాడు రంగనాయక సాగర్ లో ప్రజలకు అన్యాయం చేసిండని మండిపడ్డారు. గజ్వేల్ ప్రజలు ఓడగొట్టేందుకు సిద్దం కావడంతో కామారెడ్డికి పారిపోయిండన్నారు. కేసీఆర్ కాశ్వీర్, కన్యాకుమారి, శంకరగిరి మాన్యాలు పోయిన గజ్వేల్ ప్రజలు వదలరి ఓడగొడతారని జోష్యం పలికారు. 10 సంవత్సరాలుగా ప్రజలను గోస పెడుతూ, ప్రాజెక్టుల పేరిట రైతుల భూములు తీసుకొని ఫాంహౌస్ కు సాగునీరు తరలించుకున్న కేసీఆర్ ణు ఓడిరచి పొలిమేర వరకు తరమాలని పిలుపునిచ్చారు. ఓడితే ఫాం హౌస్ లో పడుకుంటా అనుకుంటున్న కేసీఆర్ ను ఇడ్చుకొచ్చి దోచుకున్న లక్షకోట్లను వసులు చేయడం తో పాటుగా, హైదరాబాద్ చుట్టూ ప్రక్కల అక్రమించుకున్న 10 వేల ఎకరాల భూములను బాజాప్తా గుంజుకుంటామన్నారు. కేసీఆర్ తింటే బకాసురుడు..పంటే కుంబకర్ణుడు అన్నారు. కొడంగల్ లో కేసీఆర్ తన పై ఇష్ట మొచ్చినట్లు మాట్లాడిన కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో..మందేసి మాట్లాడుతున్నాడో తెలువదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆడ బిడ్డలకు రూ.2500, గ్యాస్ సిలిండర్ ను రూ.500లకు, ఆడ బిడ్డలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా పేరిట రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రూ.15వేలు, ఉపాధి హామీ కూలీలకు 12వేలు, చదువకునే పిల్లలకు రూ.5లక్షల రుణ సౌకర్యం కల్పిస్తామని హామీనిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను అమలు చేయడం తో పాటుగా కేసీఆర్ బొందపెడితే వచ్చే నెల నుండి ఫెన్షన్ రూ.5వేలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
నిజామాబాద్ ప్రచారంలో రేవంత్
సీఎం కేసీఆర్ రాసిపెట్టుకో కాంగ్రెస్ పార్టీకి 80 సీట్ల కంటే ఒక్క సీటు తగ్గదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పదేళ్లపాటు కుటుంబం అంతా కలసి దోచుకుందని అన్నారు. వారికి ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. కెసిఆర్ను ఓడిరచడం ద్వారా నిజామాబాద్ ప్రజలు చరిత్ర సృష్టించాలన్నారు. బుధవారం నాడు ఉమ్మడి జిల్లాలో రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్రెడ్డి నిజామాబాద్ జిల్లాలో మాట్లాడుతూ…‘డిసెంబర్ 3వ తేదీన లెక్క చూసుకో కేసీఆర్.. 80 కంటే ఒక్కటి తక్కువున్నా ఏ చర్యకైనా సిద్ధం. కేసీఆర్కు పదేళ్లు అవకాశం ఇచ్చారు. ఇక్కడ పోడు భూముల సమస్య తీరలేదు. గిరిజనులను బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో తీరుస్తానని పదేళ్లయినా తెరువలేదు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఇక్కడి రైతులు ఓడిరచారు. ఈ ప్రాంత రైతుల సమస్యలను బీఆర్ఎస్ నేతలు పట్టించుకోలేదు. బాజిరెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ కార్మికులను నిర్లక్ష్యం చేసి వారి హక్కులను కాలరాశారు. అయ్య బక్కోడు.. కొడుకు తిరుగుబోతోడు. ప్రజలను ఆదుకోవాలంటే ఒక్కరూ ముందుకు రారు.ఎర్రజొన్న రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయలేదు. పసుపు బోర్డు తెస్తానన్న గుండోడు ఎక్కడికో పోయిండు. నేను పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంత యువకులు నన్ను ఇక్కడి నుంచి పోటీ చేయమని అడిగారు. అధిష్ఠానం నన్ను కామారెడ్డిలో పోటీ చేయమని ఆదేశించింది‘ అని రేవంత్రెడ్డి తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరు గెలుస్తారో రాష్ట్ర ప్రభుత్వం అదే వస్తుంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం. మేడిగడ్డ మూడేళ్లకే కుంగి పోయింది. మీరు కట్టిన ప్రాజెక్టులు చూపించి బీఆర్ఎస్ నేతలు ఓట్లు అడగాలి. మేము కట్టిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూపించి ఓట్లు అడుగుతాం. ఇందిరమ్మ రాజ్యం అంటే గరీబోళ్ల రాజ్యం. బీఆర్ఎస్ అంటే దొరల రాజ్యం, దొంగల రాజ్యం. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ ఊహాలోకంలో ఉంచారు. ఆయన మాత్రం 150 రూముల బంగ్లా కట్టుకున్నాడు. బోధన్ ఏసీపీకి చెప్తున్నా.. నీ నౌకరి నువ్వు చెయి.. బీఆర్ఎస్ కార్యకర్తలాగా చేయకు.. డిసెంబర్ 3వ తేదీ తర్వాత ఏమైతదో చూడు కేసీఆర్‘ అని రేవంత్రెడ్డి సవాల్ విసిరారు.